జి.కొండూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి లంక నాగేశ్వరరావు (నాని) గారికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి లంకా కోటేశ్వరరావు (84) గారు ఇటీవల వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య గారు శుక్రవారం కుంటముక్కల గ్రామంలోని లంక నాగేశ్వరరావు గారి స్వగృహానికి వెళ్లి కోటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కోటేశ్వరరావు గారి మృతికి సంతాపం వ్యక్తం చేసిన జంపాల సీతారామయ్య గారు ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. లంక నాగేశ్వరరావు గారికి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యం కల్పించారు. కోటేశ్వరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు గారు పజ్జురు వెంకయ్య గారు పజ్జూరు విజయ్ గారు లంక రామకృష్ణ గారు మరియు స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు


