పలు అభివృద్ధి పనుల ప్రారంభం.. మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్న మంత్రి
ఆత్మకూరు, సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి): రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఈ నెల 18వ తేదీ శుక్రవారం ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ఆత్మకూరులోని వెస్ట్ ఎంపీపీఎస్ పాఠశాల ప్రాంగణంలో రూ.28.30 లక్షల వ్యయంతో నిర్మించిన ‘భవిత భవనం’ను ప్రారంభిస్తారు.
అనంతరం ఉదయం 10.15 గంటలకు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో రూ.53 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం (ఎంఆర్సీ), మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు.
ఉదయం 10.30 గంటలకు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించే ఆత్మకూరు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొని అభివృద్ధి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్యాంపు కార్యాలయం, నెల్లూరు నుంచి కార్యక్రమ వివరాలను విడుదల చేశారు.


