నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులని పేర్కొన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. వారి పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ, జర్నలిస్టులకు పెన్షన్ అమలు అవసరమని తెలిపారు. గిరిజనులు, దళితులు, బీసీల సమస్యలపై మీడియా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.




