ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా ఉంటూ ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు రైలు ప్రయాణంలో రాయితీ ఇచ్చి ఆదుకోవాలని అన్నమయ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఘురామరాజు రాజంపేట సరస్వతి విద్యా మందిర్ నూతన ఏర్పాటు చేసిన అదనపు గదులు ప్రారంభోత్సవానికి హాజరైన రైల్వే బోర్డు చైర్మన్ ఎంపీ సీఎం రమేష్ కు వినతిపత్రం సమర్పించారు.గతంలో జర్నలిస్టులకు భారతదేశంలో రైలులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాయితీతో ప్రయాణం చేస్తే సౌకర్యం ఉండేదని కోవిడ్ సమయంలో రాయితీని తీసివేసారని రఘురామరాజు వినతి పత్రంలో పేర్కొన్నారు.రైల్వే బోర్డు చైర్మన్ గా తమ వినతిని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ వినతిని తీసుకెళ్లాలని రైలు ప్రయాణంలో రాయితీని తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఇందుకు ఎంపీ సీఎం రమేష్ స్పందిస్తూ మీ వెనతిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని సమస్య పరిష్కరించేందుకు సానుకూలంగా స్పందిస్తానని పేర్కొన్నారు.

జర్నలిస్టులకు రైలు ప్రయాణంలో రాయితీ ఇచ్చి ఆదుకోండి
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా ఉంటూ ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు రైలు ప్రయాణంలో రాయితీ ఇచ్చి ఆదుకోవాలని అన్నమయ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఘురామరాజు రాజంపేట సరస్వతి విద్యా మందిర్ నూతన ఏర్పాటు చేసిన అదనపు గదులు ప్రారంభోత్సవానికి హాజరైన రైల్వే బోర్డు చైర్మన్ ఎంపీ సీఎం రమేష్ కు వినతిపత్రం సమర్పించారు.గతంలో జర్నలిస్టులకు భారతదేశంలో రైలులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాయితీతో ప్రయాణం చేస్తే సౌకర్యం ఉండేదని కోవిడ్ సమయంలో రాయితీని తీసివేసారని రఘురామరాజు వినతి పత్రంలో పేర్కొన్నారు.రైల్వే బోర్డు చైర్మన్ గా తమ వినతిని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ వినతిని తీసుకెళ్లాలని రైలు ప్రయాణంలో రాయితీని తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఇందుకు ఎంపీ సీఎం రమేష్ స్పందిస్తూ మీ వెనతిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని సమస్య పరిష్కరించేందుకు సానుకూలంగా స్పందిస్తానని పేర్కొన్నారు.

