ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 2 ( మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా గంధళ్ళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దర్శనం పొందారు. కార్యక్రమం భక్తి వాతావరణంలో ఘనంగా జరిగింది.

చెర్లోపల్లి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో ఘనంగా క్షీరాభిషేకం, అన్నదానం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 2 ( మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా గంధళ్ళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దర్శనం పొందారు. కార్యక్రమం భక్తి వాతావరణంలో ఘనంగా జరిగింది.

