చింతలపాలెం అభివృద్ధికి సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహా స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు మాకెన సీతారాం పాత్రుడు (నవీన్) విశేష కృషి
మాజీ సర్పంచ్గా సీసీ రోడ్లు, వీధివీధికి తాగునీటి కొళాయి కనెక్షన్లు
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,, సెప్టెంబర్ 2. ( పున్నమి ప్రతినిధి )
చింతలపాలెం: గ్రామాభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా మాజీ సర్పంచ్ మాకెన సీతారాం పాత్రుడు (నవీన్) విశేష కృషి చేస్తున్నారని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన, గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నారు.
మాజీ సర్పంచ్గా ఉన్న సమయంలో చింతలపాలెం గ్రామంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేయడంతో పాటు, వీధివీధికి తాగునీటి కొళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయించారు. దీంతో గ్రామ ప్రజలకు రాకపోకలు, తాగునీటి విషయంలో మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని స్థానికులు తెలిపారు.
ఆధ్యాత్మిక సేవల్లోనూ ముందంజ
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనకు తనవంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. గ్రామాభివృద్ధితో పాటు దేవాలయ అభివృద్ధికి కూడా ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న సీతారాం పాత్రుడు సేవలను పలువురు అభినందిస్తున్నారు .
ప్రజా సేవే లక్ష్యంగా చింతలపాలెం అభివృద్ధికి మరింత కృషి చేస్తానని సీతారాం పాత్రుడు (నవీన్) తెలిపారు.
– ప్రజా ప్రతిభ ప్రత్యేక ప్రతినిధి
రమణ ములపర్తి


