ఖమ్మం ఆగష్టు 5
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఈ-ఆఫీస్ వ్యవస్థను రెండేళ్లుగా నిలిపివేసి, మాన్యువల్ విధానంలో పనులు నిర్వహించడం ద్వారా కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు వెంకటనారాయణ ఆరోపించారు. టెండర్లు లేకుండా నిధుల దుర్వినియోగం, లక్ష రూపాయల లోపు బిల్లుల్లో అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సిట్ లేదా లోకాయుక్తతో విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.



