కర్ణాటకలో సుమారు 56 వేల మందికి పైగా తమకు హెచ్ఐవీ సోకిందనే విషయం తెలియకుండానే జీవిస్తున్నారని కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ వెల్లడించింది. ఉచిత పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవడం లేదని అధికారులు తెలిపారు. అవగాహన లోపం, సామాజిక అపోహలు, వివక్ష భయం ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ‘మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష’ కార్యక్రమాన్ని ప్రారంభించి, ‘BreakFree QR’ కోడ్ ద్వారా గోప్యంగా స్వీయ ప్రమాద అంచనా, పరీక్షా కేంద్రాల వివరాలు, కౌన్సెలింగ్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

కర్ణాటకలో 56 వేల మందికి హెచ్ఐవీ ఉందని తెలియదు
కర్ణాటకలో సుమారు 56 వేల మందికి పైగా తమకు హెచ్ఐవీ సోకిందనే విషయం తెలియకుండానే జీవిస్తున్నారని కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ వెల్లడించింది. ఉచిత పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవడం లేదని అధికారులు తెలిపారు. అవగాహన లోపం, సామాజిక అపోహలు, వివక్ష భయం ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ‘మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష’ కార్యక్రమాన్ని ప్రారంభించి, ‘BreakFree QR’ కోడ్ ద్వారా గోప్యంగా స్వీయ ప్రమాద అంచనా, పరీక్షా కేంద్రాల వివరాలు, కౌన్సెలింగ్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

