ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్ )
ఖమ్మం: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు సూచనల మేరకు ఖమ్మం టూ టౌన్ పరిధిలోని 51వ డివిజన్లో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు. శక్తి కేంద్ర ఇన్చార్జి, జిల్లా ఆఫీస్ సెక్రటరీ నక్కల రవి గౌడ్ ఆధ్వర్యంలో 136, 137 పోలింగ్ బూత్లలో బీఎల్ఏ-2 రాధ, బీఎల్ఓ అధికారులతో ఆన్లైన్ నమోదు, ఓటర్ల షిఫ్టింగ్, మరణాల నమోదుకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు, రాష్ట్ర నాయకుడు సన్నే ఉదయ్ ప్రతాప్, టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ
రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు దొంతు జ్వాలా నరసింహారావు, ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవరావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శాసనల శ్రీరామ్తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



