ఉయ్యూరు, ఆగస్టు 21: పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీ 5, 7 వార్డుల్లో డయేరియా ప్రబలడంతో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. స్థానికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. డయేరియా కారణాలపై నీటి శాంపిల్స్ టెస్టింగ్కు పంపామని, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు.

ఉయ్యూరులో డయేరియా.. మంత్రి నారాయణ పర్యటన*
ఉయ్యూరు, ఆగస్టు 21: పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీ 5, 7 వార్డుల్లో డయేరియా ప్రబలడంతో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. స్థానికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. డయేరియా కారణాలపై నీటి శాంపిల్స్ టెస్టింగ్కు పంపామని, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు.

