దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కీలక నిర్ణయంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర ప్రభుత్వానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.2.86 లక్షల కోట్ల డివిడెండ్ను బదిలీ చేయాలని నిర్ణయించింది. గత ఏడాది రూ.2.69 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.7 శాతం అధికం కావడం విశేషం. ముంబైలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన 623వ సెంట్రల్ బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. విదేశీ మారక నిల్వలు, వడ్డీ ఆదాయం, కమిషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయంలో ఖర్చులు మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని డివిడెండ్గా అందిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వానికి మరింత బలాన్ని చేకూర్చనుంది.

ఆర్బీఐ భారీ డివిడెండ్ కేంద్రానికి బదిలీ
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కీలక నిర్ణయంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర ప్రభుత్వానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.2.86 లక్షల కోట్ల డివిడెండ్ను బదిలీ చేయాలని నిర్ణయించింది. గత ఏడాది రూ.2.69 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.7 శాతం అధికం కావడం విశేషం. ముంబైలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన 623వ సెంట్రల్ బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. విదేశీ మారక నిల్వలు, వడ్డీ ఆదాయం, కమిషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయంలో ఖర్చులు మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని డివిడెండ్గా అందిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వానికి మరింత బలాన్ని చేకూర్చనుంది.

