స్రికాకుళం, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి)
డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. రజని గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్లో గురజాడ విద్యాసంస్థలు, విశ్వ సాహితీ కళావేదిక సంయుక్తంగా నిర్వహించిన యువ కవితా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దేశ భవిష్యత్తు వారి చేతిలోనే ఉందని, అభివృద్ధి దిశగా నడిపే బాధ్యత వారిదేనని తెలిపారు. జి.వి. స్వామి నాయుడు విద్యార్థులు కళలకు సమయం కేటాయించాలని సూచించగా, కె.వి.జి.డి. బాలాజీ తరగతి గోడలకతీతంగా భవిష్యత్తు నిర్మించుకోవాలని కోరారు. కె. రమావతి సాహిత్య పరిచయంపై వివరించారు. గజల్ శ్రీనివాస్ పాటలతో యువతకు స్ఫూర్తినిచ్చారు. జంద్యాల శరత్ బాబు, గౌరిశంకర్, ఈ వేమన, ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.


