జిల్లా ఇంచార్జి ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు అల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ కాలనీలో సోమవారం ఉదయం విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 32 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్న ఈ తనిఖీల్లో సుమారు 150 ఇళ్లను పరిశీలించి, పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రజలకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ, పోక్సో చట్టం, రోడ్డు భద్రత, మహిళల రక్షణ, అత్యవసర సేవల వినియోగంపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, నేరాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని అధికారులు ప్రజలను కోరారు.




