అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి ఆదేశాలతో శుక్రవారం మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణకు మట్టి విగ్రహాలే మేలని ప్రిన్సిపాల్ సూచించారు. విద్యార్థినులు నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అధ్యాపకులు, సిబ్బందికి ప్రిన్సిపాల్ మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

అరకు: మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన ర్యాలీ
అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి ఆదేశాలతో శుక్రవారం మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణకు మట్టి విగ్రహాలే మేలని ప్రిన్సిపాల్ సూచించారు. విద్యార్థినులు నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అధ్యాపకులు, సిబ్బందికి ప్రిన్సిపాల్ మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

