ముధోల్,ఆగస్టు 08(పున్నమి ప్రతినిధి ): మండల కేంద్రమైన ముధోల్ లోని అక్షర పాఠశాలలో శనివారం బోనాల సంబరాలు కన్నుల పండువగా సాగాయి, పాఠశాల డైరెక్టర్ సుభాష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని పేర్కొంటూ, విద్యార్థులకు పండుగ విశిష్టతను వివరించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ధరించిన పోతురాజుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థినులు బోనాలతో, పాటలు పాడుతూ, ఆడుతూ అత్యంత ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సాయికుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


