*తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి చిత్రపటం గింజల తో వేసి వినూత్న ప్రదర్శన*
*ఖమ్మం జిల్లా యూత్ అధ్యక్షులు వెజండ్ల సాయి*
ఖమ్మం :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెజండ్ల సాయి ఆధ్వర్యంలో
మల్లు భట్టి విక్రమార్క చిత్రపటాన్ని గోధుమ గింజలతో రూపొందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రపటం చూపరులను ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెజండ్ల సాయి మాట్లాడు
భట్టి విక్రమార్క
సేవా దృక్పథాన్ని, ప్రజా సంక్షేమానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. “పేద ప్రజల పక్షాన నిలబడి, రాష్ట్ర ఆర్థిక పురోగతికి పాటుపడుతున్న డిప్యూటీ సీఎం గారికి ఇది మా చిన్న కానుక. ఆయన ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


