పి.గన్నవరం నుండి సెప్టెంబరు 17 పున్నమి ప్రతినిధి. పి గన్నవరం మండల గ్రామ రెవెన్యూ సహాయకుల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావు ఆధ్వర్యం లో తహశీల్దారు కార్యాలయం వద్ద మండలంలో గల 28 మంది వీఆర్ఏలు రెండవరోజు సహాయ నిరాకరణ ఉద్యమ పోరాట సమ్మె నిర్వహించడం జరిగింది.మూడు ప్రధాన డిమాండ్లు.1. గ్రామ రెవెన్యూ సహాయకులను నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేల్ అమలు చేయాలి.2.నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏలను. వీఆర్ఏలుగా క్రమబద్ధీకరించాలి.3. అర్హత గల వీఆర్ఏ లకు పదోన్నతి కల్పించాలి 2018 సంవత్సరంలో వేతనం ₹6,200/- నుండి ₹10,500/-కు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పెంచింది. అయితే, అప్పటి నుండి ఇప్పటివరకు మా వేతనంలో మరే విధమైన పెంపు జరగలేదు.కావున దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వీఆర్ఏలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ: యార్లగడ్డ మహాలక్ష్మి శ్రీను.ఉపాధ్యక్షులు పల్లేరు చిట్టివెంకన్న లోకేష్
డివిజన్ గౌరవ అధ్యక్షుడు కుంపట్ల రామకృష్ణ తదితరులు


