*అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేకే వైసీపీ నేతల కారుకూతలు*
*ఎవరి బతుకులు ఎలాంటివో..దగ్గర నుంచి చూసిన ఆయా గ్రామాల ప్రజలకు తెలుసు*
*జీవితమంతా పచ్చి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలకే పరిమితం*
*తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాళెంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించిన సోమిరెడ్డి*
*పలు సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే అధికారులకు సూచనలు*
*సోమిరెడ్డి కామెంట్స్*
రెండేళ్ల నమ్మకం..అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా వెంకన్నపాళెం ఎస్టీ కాలనీలో పర్యటించడం సంతోషంగా ఉంది
కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో వెంకన్నపాళెం పంచాయతీ పరిధిలో అనేక కార్యక్రమాలు చేపట్టాం
రూ.70 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మించి 15 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపించాం
రూ.7 లక్షలతో సైడ్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాం
మహాలక్ష్మిపురం సెంటర్ నుంచి వెంకన్నపాళెం రోడ్డు నిర్మాణానికి రూ.1.80 కోట్లు నిధుల మంజూరు చేశాం..త్వరలోనే పనులు ప్రారంభంకాబోతున్నాయి
దేవస్థానం నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేయిస్తాను
రెండు ఎకరాల ఖాళీ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు చేపడతా
చిన్నారులు స్కూలుకు వెళ్లేందుకు ఆటో ఏర్పాటు చేయించబోతున్నాను
గిరిజనుల సమస్య పరిష్కారానికి నేను ఎప్పుడూ ముందుంటా
రెండేళ్లలో 3500 మంది గిరిజనులకు ఆధార్ కార్డులు ఇప్పించా
అమాయకులైన గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడం విద్యతోనే సాధ్యం
ప్రతి గిరిజన బిడ్డ చదువుకోవడానికి తల్లికి వందనం పథకం ఎంతో ఉపయోగకరంగా మారింది
తల్లికి వందనం పథకంతో ఒక్కో గిరిజన కుటుంబంలో ఐదారుగురు బిడ్డలకు కూడా ఆర్థిక ప్రయోజనం లభించింది
ఒక్క వెంకన్నపాళెం పంచాయతీలోనే తల్లికి వందనం పథకం ద్వారా రెండేళ్లలో 617 మందికి రూ.1.86 కోట్ల లబ్ధి చేకూరింది
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 404 మంది రైతులు రూ. 1.60 కోట్ల ఆర్థిక లబ్ధి పొందారు
541 మంది లబ్ధిదారులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లుగా రూ. 5.66 కోట్లు పొందారు
మత్స్యకారుల సేవలో భాగంగా 159 మంది మత్స్యకారులు రూ.61.6 కోట్లు అందుకున్నారు
మొత్తంగా రెండేళ్లలో ఈ పంచాయతీ ప్రజలకు కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రూ.9.80 కోట్లు లబ్ధి జరిగింది
ఇవి కాకుండా కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి
ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి, వసతుల కల్పనపై నారా లోకేష్ బాబు ప్రత్యేక దృష్టి పెట్టారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు
నియోజకవర్గానికి ఒక హైస్కూలును ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, సర్వేపల్లిలో చెన్నపల్లిపాళెం జిల్లా పరిషత్ హైస్కూలును ఎంపిక చేశాం
కూటమి ప్రభుత్వంలో ఏ శాఖకు ఆ శాఖ తమ పరిధిలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేసుకుంటూ పోతున్నాయి
గత ప్రభుత్వ పాలనలో మాదిరిగా కీలక శాఖలను మూతేసి బటన్ల నొక్కుడుకు పరిమితం కాలేదు
మా ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూడలేక వైసీపీ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారు
వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిన భోగాపురం ఎయిర్ పోర్టును మేం పూర్తి చేసి ప్రారంభించుకోవడాన్ని చూసి తట్టుకోలేక కడుపు మంటతో రగలిపోతున్నారు
ఉత్తరాంధ్రలో అద్భుతమైన ఎయిర్ పోర్టు రావడాన్ని ఓర్చుకోలేని పరిస్థితి
డీఎస్సీలో 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసి మరో నోటిఫికేషన్ కు సిద్ధపడటాన్నీ ఓర్వలేకపోతున్నారు
గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన పనులకు, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధికి ఎక్కడా పోలికే లేదు
ఏ గ్రామానికి వెళ్లినా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది
ఇవన్నీ చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు పిచ్చివాగుడుతో నోర్లు పారేసుకుంటున్నారు
పచ్చి అబద్ధాలతో వారి జీవితాలు గడిచిపోతున్నాయి
ఎవరి బతుకులు ఏంటో ప్రజలకు తెలుసు..మా ఊరిలో మేము ఎలా బతికామో మా గ్రామస్తులందరికీ తెలుసు
నోరు పారేసుకుంటున్న వారు ఎలా బతికారో…వాళ్ల గ్రామాల ప్రజలు దగ్గర నుంచి చూశారు



