వైష్యులకు ప్రభుత్వం కేటాయించిన భూమి పూజ మరియు ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం దిగ్విజయం చేయాలి :ప్రమోద్
కుమార్
————————————————————
జనగామ, సెప్టెంబర్ 11,పున్నమి జిల్లా ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన వైశ్యులకు ఉప్పల్ బాగాయతులో హైదరాబాదులో 5 ఎకరళ కేటాయించిన స్థలంలో మన వైశ్య జాతి ఉన్నతికి అద్దం పట్టే విధంగా వివిధ రకాల ఉపయోగకరమైన నిర్మాణం నిర్మించుటకు మన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వారు తేదీ 13-9-2026 రోజున ఉదయం 10:30కు భూమి పూజ కార్యక్రమం, శ్రీనివాస కళ్యాణము మరియు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుటకు గాను ముహూర్తం నిర్ణయించడం జరిగింది అని గంగిశెట్టి మనోజ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మరియు ముఖ్యఅతిథిగా మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారు హాజరు అయి ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు,కావున మన వైశ్యులందరూ ముఖ్యంగా మన జనగామ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి గన్ను నరసింహులు కోశాధికారి బేజగం బిక్షపతి రీజియన్ చైర్మన్లు పడకంటి రవీందర్ సరాబ్ ఆంజనేయులు మహిళా విభాగము డాక్టర్ మదoశెట్టి వరూధిని గంగిశెట్టి అనూజ తమ్మి స్రవంతి మరియు జనగామ మండల కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు తదితరులు కోరుచున్నారు అక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ అల్పాహారము మరియు విందు ఏర్పాటు చేయబడినది అని మనోజ్ తెలిపారు.


