విద్యాశాఖామంత్రి నారా లోకేష్ తో పట్టభద్రుల ఎమ్మెల్సీలు
కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి రావు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిలు సోమవారం సాయంత్రం కలిసి పలు విద్యా శాఖ సమస్యలను వివరించారు.
నారా లోకేష్ క్యాంపు కార్యాలయంలో వీరితో క్షేత్రస్థాయిలో సమస్యలు లేకుండా అధ్యయనం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా టీచర్లు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రమోషన్లు,తదితర సమస్యలపై ముగ్గురు యమ్ యల్ సి లు దృష్టి కి తేగా, వాటిపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి ఎన్ని సమస్యలు, ఆటంకాలు ఉన్నా ఉద్యోగులకు సమస్యలు లేకుండా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని లోకేశ్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు ఆ సంఘం నేతలతో అనుబంధం సాగించాలని లోకేష్ సూచించారు.

లోకేష్ తో పట్టభద్రుల ఎమ్మెల్సీత్రయం ఉపాధ్యాయ సమస్య లపై చర్చ
విద్యాశాఖామంత్రి నారా లోకేష్ తో పట్టభద్రుల ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి రావు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిలు సోమవారం సాయంత్రం కలిసి పలు విద్యా శాఖ సమస్యలను వివరించారు. నారా లోకేష్ క్యాంపు కార్యాలయంలో వీరితో క్షేత్రస్థాయిలో సమస్యలు లేకుండా అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీచర్లు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రమోషన్లు,తదితర సమస్యలపై ముగ్గురు యమ్ యల్ సి లు దృష్టి కి తేగా, వాటిపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి ఎన్ని సమస్యలు, ఆటంకాలు ఉన్నా ఉద్యోగులకు సమస్యలు లేకుండా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని లోకేశ్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు ఆ సంఘం నేతలతో అనుబంధం సాగించాలని లోకేష్ సూచించారు.

