అందరికీ నమస్కారం,
రేపు అనగా 11-09-2026 (శుక్రవారం) ఉదయం 10:00 గంటల నుంచి గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు కొండపల్లిలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడే “ప్రజాదర్బార్” కార్యక్రమంలో పాల్గొననున్నారు.
*గమనిక:*
ప్రజలు తమ సమస్యలను క్లుప్తంగా వివరించిన అర్జీపై ఫోన్ నంబర్ నమోదు చేసి, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని జతచేసి సమర్పించగలరు.
కావున, కొండపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు మరియు కూటమి నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వినమ్ర విజ్ఞప్తి.
జై తెలుగుదేశం! జై వసంత!
– కరిమికొండ బాలాజీ రావు
అధ్యక్షులు, టీడీపీ కొండపల్లి మున్సిపాలిటీ




