రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధ్యాపక, బోధనేతర సిబ్బంది మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ని కలిశారు. కళాశాలకు సంబంధించిన పలు సమస్యలు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సిబ్బంది సమస్యలను మంత్రి సానుకూలంగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. విద్యా రంగ అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

రాయచోటి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమస్యలపై మంత్రికి వినతి
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధ్యాపక, బోధనేతర సిబ్బంది మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ని కలిశారు. కళాశాలకు సంబంధించిన పలు సమస్యలు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సిబ్బంది సమస్యలను మంత్రి సానుకూలంగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. విద్యా రంగ అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

