అనంతసాగరం సెప్టెంబర్ 07,పున్నమి ప్రతినిధి :
మండల కేంద్రం అనంతసాగరం బస్టాండ్ సెంటర్లో వెలిసి వున్న శ్రీ హజ్రత్ మష్కుర్ అలీషా ఖాదరి వారి 16వ గంధ మహోత్సవం ఆదివారం రాత్రి దర్గా పీఠాధిపతులు మజీద్ సాహెబ్ సాని సాహెబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ గంధమహోత్సవానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, సయ్యద్ సమీ హుస్సేని ముఖ్య అతిధులుగా పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్బంగా దర్గా వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు..ఈ గంధమహోత్సవంలో డిప్యూటీ మేయర్ ఇంతియాజ్, టీడీపీ పార్లమెంట్ నాయకులు సాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు..


