కొయ్యూరు సీపీఐ ఉమ్మడి జిల్లా మాజీ సహాయ కార్యదర్శి, మాజీ ఎంపీపీ బడుగు రామరాజ్యం వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మంప పంచాయతీ కించేవానిపాలెంలోని ఆయన స్మారక స్తూపం వద్ద పలువురు నేతలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. రామరాజ్యం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్ బాబు, సీపీఐ మండల కార్యదర్శి సూరిబాబు, మాజీ సర్పంచ్ సోమన్నదోర, స్థానిక నాయకులు కనకరాజు, నానాజీ, చిన్నారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


