రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ జులై 23 (పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్, యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రిగా కేటీఆర్ చేసిన సేవలను కొనియాడుతూ, ఆయనకు ఆయురారోగ్యాలు కలిగి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కేటీఆర్ నాయకత్వంలో కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బొంపెల్లి సురేందర్ రావు, సందుపట్ల అంజిరెడ్డి, నరసింహారెడ్డి, మిడిదొడ్డి యాదగిరి, ఎండి. జహంగీర్, శీలం వెంకటేష్, మోతె రవి, వంగూరి దిలీప్ , పోతారం సతీష్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



