శ్రీకాళహస్తి, జూన్ 13, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామానికి చెందిన పూసల చలపతి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న బొజ్జల రిషీతా రెడ్డి గ్రామాన్ని సందర్శించి చలపతి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆమె, వారి దుఃఖంలో తాము భాగస్వాములమని పేర్కొంటూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచిస్తూ వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్, యూనిట్ ఇన్చార్జ్ నరసయ్య, బూత్ ఇన్చార్జ్ మురళీమోహన్ రెడ్డి, మాజీ వీఆర్వో రమణ రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, శానంపూరి నారాయణ, దండి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వారు కూడా చలపతికి అంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ముచ్చివోలులో చలపతికి నివాళి.. కుటుంబానికి పరామర్శ
శ్రీకాళహస్తి, జూన్ 13, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామానికి చెందిన పూసల చలపతి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న బొజ్జల రిషీతా రెడ్డి గ్రామాన్ని సందర్శించి చలపతి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆమె, వారి దుఃఖంలో తాము భాగస్వాములమని పేర్కొంటూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచిస్తూ వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్, యూనిట్ ఇన్చార్జ్ నరసయ్య, బూత్ ఇన్చార్జ్ మురళీమోహన్ రెడ్డి, మాజీ వీఆర్వో రమణ రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, శానంపూరి నారాయణ, దండి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వారు కూడా చలపతికి అంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

