మర్రిపాడు మండలంలోని 72 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు చెందిన సుమారు 1,500 మంది విద్యార్థులకు శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6,400 నోటు పుస్తకాలను ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర రెడ్డి పంపిణీ చేశారు. విద్యార్థులు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనిల్ కుమార్, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొని ఆయన సేవలను ప్రశంసించారు. విద్యార్థుల్లో పోటీ తత్వం పెంపొందించి, మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కంచి పరమేశ్వర రెడ్డి తెలిపారు. అనంతరం ఆయనను అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు.



