Saturday, 12 September 2026
  • Home  
  • మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణకు బాల అకాడమీ విద్యార్థుల ప్రతిజ్ఞ
- నంద్యాల

మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణకు బాల అకాడమీ విద్యార్థుల ప్రతిజ్ఞ

నంద్యాల: పర్యావరణహితంగా వినాయక చవితిని జరుపుకోవాలనే సందేశంతో బాల అకాడమీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యావరణ ఇంజనీర్ పి.వి. కిషోర్ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధి రామకృష్ణ, ప్రిన్సిపాల్ మాధవి లత హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి, పర్యావరణాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, రసాయన రంగుల వల్ల నీరు, జలచరాలు కలుషితమవుతాయని, ప్రతీ ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని అధికారులు అవగాహన కల్పించారు. చిన్నతనం నుంచే పర్యావరణ స్పృహ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. “మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే సందేశంతో ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా ముగిసింది.

నంద్యాల: పర్యావరణహితంగా వినాయక చవితిని జరుపుకోవాలనే సందేశంతో బాల అకాడమీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యావరణ ఇంజనీర్ పి.వి. కిషోర్ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధి రామకృష్ణ, ప్రిన్సిపాల్ మాధవి లత హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి, పర్యావరణాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, రసాయన రంగుల వల్ల నీరు, జలచరాలు కలుషితమవుతాయని, ప్రతీ ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని అధికారులు అవగాహన కల్పించారు. చిన్నతనం నుంచే పర్యావరణ స్పృహ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. “మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే సందేశంతో ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా ముగిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.