Thursday, 21 May 2026
  • Home  
  • భీమవరం ఆక్వా ఫ్యాక్టరీ ప్రమాదంపై ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కుమార్ బస్వాని స్పందన – బాధితులకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్
- పశ్చిమ గోదావరి

భీమవరం ఆక్వా ఫ్యాక్టరీ ప్రమాదంపై ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కుమార్ బస్వాని స్పందన – బాధితులకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్

భీమవరంలోని ఆక్వా ప్రొడక్ట్ ఫ్యాక్టరీలో జరిగిన విషాదకర ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ఫ్యాక్టరీలో డ్రైనేజీ శుభ్రపరిచే పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న ఇన్‌ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా, 2024 భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కుమార్ బస్వాని ఈ ఘటనపై స్పందించారు. ప్రమాదంలో బాధితులైన కుటుంబాలకు పూర్తి న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు.

pavankumarbaswani mla

భీమవరంలోని ఆక్వా ప్రొడక్ట్ ఫ్యాక్టరీలో జరిగిన విషాదకర ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ఫ్యాక్టరీలో డ్రైనేజీ శుభ్రపరిచే పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాద సమాచారం అందుకున్న ఇన్‌ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా, 2024 భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కుమార్ బస్వాని ఈ ఘటనపై స్పందించారు. ప్రమాదంలో బాధితులైన కుటుంబాలకు పూర్తి న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.