04-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఇస్కపాలెం గ్రామపంచాయతీ బిట్ 1 లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ 2020 ద్వారా రెండో విడత దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు వివరాల వెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది. ఎన్నికల ప్రచారం సమయంలో చేసిన వాగ్దానం ప్రకారం తమ సొంత ఇల్లు నిర్మించలేని రాష్ట్రంలోని పేద ప్రజలకు గృహాన్ని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జూలై 12, 2019 న వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ 2020 ను ప్రారంభించారు. ఈ పథకం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రధాన 9 వాగ్దానాల్లో ఒకటి. ఈ పథకానికి ఆయన తండ్రి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న పేరు పెట్టారు. ఈ పథకాన్ని అంతకు ముందు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం గా వ్యవహరించేవారు.YSR హౌసింగ్ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక బలహీన విభాగం వర్గం పౌరుడికి రాష్ట్ర ప్రభుత్వ చొరవ. రాష్ట్ర ప్రభుత్వం అన్ని లబ్ధిదారులకు పక్కా గృహాన్ని అందించబోతోంది, దీని కోసం రాష్ట్ర బడ్జెట్ కింద రూ.1280 కోట్లు కేటాయించారు.ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి బి. రాజేంద్రనాథ్ రెడ్డి మొదటి రాష్ట్ర బడ్జెట్ సమయంలో ప్రకటించారు. ఈ గృహ పథకం ముఖ్యంగా రాష్ట్రంలోని EWS/MIG/LIG వర్గం ప్రజలకు. ఈ కార్యక్రమంలో ఇస్కపాలెం బిట్ 1 వి ఆర్ ఓ శ్రీనివాసులురెడ్డి, వి ఆర్ ఏ లు రమణయ్య, యాదగిరి, ఆ ఏరియా వాలేంటర్ బబ్లూ పాల్గొన్నారు.
బుచ్చిరెడ్డిపాలెం లోని ఇస్కపాలెం గ్రామ పంచాయతీలో వై ఎస్ ఆర్ హౌసింగ్ స్కీమ్ ధరకాస్తుదారురుల వెరిఫికేషన్.
04-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఇస్కపాలెం గ్రామపంచాయతీ బిట్ 1 లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ 2020 ద్వారా రెండో విడత దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు వివరాల వెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది. ఎన్నికల ప్రచారం సమయంలో చేసిన వాగ్దానం ప్రకారం తమ సొంత ఇల్లు నిర్మించలేని రాష్ట్రంలోని పేద ప్రజలకు గృహాన్ని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జూలై 12, 2019 న వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ 2020 ను ప్రారంభించారు. ఈ పథకం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రధాన 9 వాగ్దానాల్లో ఒకటి. ఈ పథకానికి ఆయన తండ్రి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న పేరు పెట్టారు. ఈ పథకాన్ని అంతకు ముందు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం గా వ్యవహరించేవారు.YSR హౌసింగ్ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక బలహీన విభాగం వర్గం పౌరుడికి రాష్ట్ర ప్రభుత్వ చొరవ. రాష్ట్ర ప్రభుత్వం అన్ని లబ్ధిదారులకు పక్కా గృహాన్ని అందించబోతోంది, దీని కోసం రాష్ట్ర బడ్జెట్ కింద రూ.1280 కోట్లు కేటాయించారు.ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి బి. రాజేంద్రనాథ్ రెడ్డి మొదటి రాష్ట్ర బడ్జెట్ సమయంలో ప్రకటించారు. ఈ గృహ పథకం ముఖ్యంగా రాష్ట్రంలోని EWS/MIG/LIG వర్గం ప్రజలకు. ఈ కార్యక్రమంలో ఇస్కపాలెం బిట్ 1 వి ఆర్ ఓ శ్రీనివాసులురెడ్డి, వి ఆర్ ఏ లు రమణయ్య, యాదగిరి, ఆ ఏరియా వాలేంటర్ బబ్లూ పాల్గొన్నారు.