నెల్లూరు, జూలై 23: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ గురువారం 23వ డివిజన్ పడారుపల్లిలోని మారుతి లేఅవుట్, 3వ డివిజన్ ప్రశాంతినగర్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదులను పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. సిటీ ప్లానర్ రఘునాథరావు, టీపీబీవోలు, వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది కమిషనర్ పర్యటనలో పాల్గొన్నారు.



