ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు పోటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని టీడీపీ మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్రావు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మౌలిక వసతులు, బోధన ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు.శుక్రవారం
వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లిలోని రావిళ్ల నాగేశ్వరరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథులుగా మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు, జడ్పిటిసి రావెళ్ల నాగేంద్ర, యూనిట్ ఇంచార్జ్ నాదెండ్ల రాజా లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. అనంతరం తల్లిదండ్రుల కోసం నిర్వహించిన వివిధ ఆటల పోటీలు సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు అభినందనలు తెలియజేశారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడులకు కొత్త ఊపు తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో విద్యాభివృద్ధిపై దృష్టి.. టీడీపీ మండల కన్వీనర్ చంద్రా మధుసూదన్రావు
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు పోటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని టీడీపీ మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్రావు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మౌలిక వసతులు, బోధన ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు.శుక్రవారం వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లిలోని రావిళ్ల నాగేశ్వరరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథులుగా మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు, జడ్పిటిసి రావెళ్ల నాగేంద్ర, యూనిట్ ఇంచార్జ్ నాదెండ్ల రాజా లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. అనంతరం తల్లిదండ్రుల కోసం నిర్వహించిన వివిధ ఆటల పోటీలు సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు అభినందనలు తెలియజేశారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

