సంగం: సంగం గ్రామంలోని తొగట–పద్మశాలి వర్గాల ప్రజలు కర్మకాండలు నిర్వహించుకునేందుకు అవసరమైన స్థలం, వసతులు కల్పించాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం టీడీపీ మండల నాయకుడు కాకు మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో మోతుకూరి వినయ్, వెంగయ్య, పవన్, వేణు, నారే వెంకటేశ్వర్లు తదితరులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం సర్వేయర్ రాజ స్థానికంగా సమస్యను పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్, వీఆర్వోతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో త్వరలో సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

కర్మకాండలకు వసతులు కల్పించాలి
సంగం: సంగం గ్రామంలోని తొగట–పద్మశాలి వర్గాల ప్రజలు కర్మకాండలు నిర్వహించుకునేందుకు అవసరమైన స్థలం, వసతులు కల్పించాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం టీడీపీ మండల నాయకుడు కాకు మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో మోతుకూరి వినయ్, వెంగయ్య, పవన్, వేణు, నారే వెంకటేశ్వర్లు తదితరులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం సర్వేయర్ రాజ స్థానికంగా సమస్యను పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్, వీఆర్వోతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో త్వరలో సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

