భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా పెద్ది కొరకు భారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన చింతల రామారావు (బాబీ), చింతల రవికుమార్ (చంటి)
విజయవాడ పున్నమి, ప్రతినిధి సురేష్
విజయవాడ గాంధీనగర్ లో మా మిత్ర మండలి, మా ఆర్ట్స్ యొక్క పర్యవేక్షణలో భారతదేశంలోనూ మొట్టమొదటిసారి ఎక్కడలేని విధంగా పెద్ది సినిమా విజయవంతం అవ్వాలని గాంధీనగర్ లోని రాజ్ యువరాజ్ థియేటర్ ముందు అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ జూన్ నెల మూడో తేదీ సాయంత్రం 6:00 కి ఏర్పాటు చేస్తున్నట్లు మా మిత్ర మండలి నిర్వాహకులు చింతల రామారావు (బాబీ), చింతల రవికుమార్ (చంటి), అడబాల కృష్ణాజీ మరియు మేస్త్రి ఒక్క ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యుల యొక్క విశేషాలను ప్రదర్శన చేయనున్నట్లు స్పష్టం చేశారు. మెగా పవర్ స్టార్ నటించిన పెద్ది సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ నగర రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు. సినిమాలో నటించిన హీరోయిన్ జాన్వీ కపూర్ కి, సినిమా డైరెక్టర్ బుచ్చిబాబుకి, సినీ నిర్మాత కిలారు వెంకట సతీష్ కి, సినిమాలో నటించిన నటీనటులకు మరియు పని చేసిన సిబ్బందికి మెగా అభిమానులకు, పెద్ది సినిమా విడుదల ముందస్తుగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. జూన్ 4వ తేదీన విడుదలయ్యే పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కావున జూన్ నెల మూడో తేదీన సాయంత్రం ఆరు గంటలకి సినీ అభిమానుల కొరకు, మెగా అభిమానుల కొరకు, రాజకీయ పార్టీలు, కుల మతాలకతీతంగా నగర ప్రజల కొరకు, ప్రత్యేక విశేషాలతో ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.



