*పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో డొక్కా సీతమ్మ క్యాంటీన్ లో అన్నదానం*
*తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యం లో ప్రతీ మంగళవారం నిర్వహణ*
కాకినాడ జిల్లా జగ్గంపేట పున్నమి తెలుగు డైలీ న్యూస్ జూన్ 24:
జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట పట్టణం స్థానిక పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో జగ్గంపేట జనసేన ఇంచార్జ్ మరియు తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు.ఈ రోజు అన్నదానం కార్యక్రమం ని జగ్గంపేట నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్బంగా జనసేన నాయకులు మాట్లాడుతు జగ్గంపేట జనసేన ఇంచార్జి రమేష్ గారు తన సొంత ఖర్చులతో గత ఎన్నికల అన్నంతరం నుండి నిర్వీరామం గా కొనసాగిస్తున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమం లో మాధపు వీరబాబు,కురుమల్ల నాగేశ్వరావు,గంధం శ్రీను,సత్తి సోమరాజు,అంకం ఓం,కనకరాజు,గండికోట శ్రీను,శ్రీమన్నారాయణ,ముత్యాల వెంకట రాజు,డ్రిల్ల్ మాస్టారు ఇతరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

