పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు చెందిన ప్రాముఖ్య చేనేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్ మరో అద్భుత కళాఖండాన్ని రూపొందించారు రత్నకుమారి కోటేశ్వరరావు ఆర్డర్ మేరకు 45 రోజుల పాటు శ్రమించి పట్టుచీరపై వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్రను వేశారు చీరలో 102 మంది ఋషుల పేర్లు 102 గోత్రనామాలు 25 చారిత్రక చిత్రాలను పొందుపరిచారు పట్టు దారం రెండు గ్రాముల బంగారు జరిలో ఏడు మీటర్ల చీరను రూపొందించి తన ప్రతిభను మరోసారి చాటారు



