నేడే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభానికి సర్వం సిద్ధం
.భారీగా తరలిరావాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు
.సభ విజయవంతానికి మంకాల శేఖర్ రెడ్డి విజ్ఞప్తి
ఇబ్రహీంపట్నం ప్రతినిధి,జూన్ 16
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ని నేడే ప్రారంభించనున్నారు.ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యుడు మల్ రెడ్డి రంగా రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంకాల శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.



