ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వే బుధవారం నుంచి ప్రారంభమైంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 12.45 లక్షల మంది ఓటర్ల వివరాల ధృవీకరణకు 1,460 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9.66 లక్షల మంది ఓటర్ల కోసం 1,000 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. మొత్తం 2,002 మంది బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించనున్నారు. ప్రజలు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచి సర్వేకు సహకరించాలని ఎన్నికల అధికారులు కోరారు.



