Thursday, 10 September 2026
  • Home  
  • ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాలి: సీపీఐ డిమాండ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాలి: సీపీఐ డిమాండ్

నెల్లూరు రూరల్‌లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో జొన్నవాడ సీల్ రోడ్డు వద్ద బుధవారం నిరసన నిర్వహించారు. బియ్యం, పప్పులు, వంటనూనె, చక్కెర, కూరగాయల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మండల కార్యదర్శి చిన్న అంకయ్య, సహాయ కార్యదర్శి వై. ఆది నారాయణ అన్నారు. బ్లాక్‌మార్కెట్‌, అక్రమ నిల్వలు, దళారీ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో పముజుల హరి, సల్లా నరసయ్య, వెంకటసుబ్బయ్య, జనార్ధన్‌, రఫీ తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు రూరల్‌లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో జొన్నవాడ సీల్ రోడ్డు వద్ద బుధవారం నిరసన నిర్వహించారు. బియ్యం, పప్పులు, వంటనూనె, చక్కెర, కూరగాయల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మండల కార్యదర్శి చిన్న అంకయ్య, సహాయ కార్యదర్శి వై. ఆది నారాయణ అన్నారు. బ్లాక్‌మార్కెట్‌, అక్రమ నిల్వలు, దళారీ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో పముజుల హరి, సల్లా నరసయ్య, వెంకటసుబ్బయ్య, జనార్ధన్‌, రఫీ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.