దేశంలో నైరుతి రుతుపవనాలు మందగించడంతో వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా సగటున 35 శాతం వర్షపాతం లోటు నమోదైంది. ముఖ్యంగా మధ్య భారతదేశంలో 61 శాతం, ఈశాన్య రాష్ట్రాల్లో 43 శాతం వర్షపాతం తగ్గినట్లు వెల్లడించింది.
ముంబై ప్రాంతానికి సాధారణంగా చేరాల్సిన రుతుపవనాలు ఇంకా ముందుకు సాగకపోవడంతో వ్యవసాయ రంగంపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సుమారు 200 జిల్లాలను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై సూచనలు ఇస్తోంది.
ఈ ఏడాది ‘సూపర్ ఎల్నినో’ ప్రభావం ఉండవచ్చని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తుండటంతో పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.


