థింసా నృత్య కళాకారుల సంప్రదాయ వేడుకల నడుమ ప్రధాని మోదీకి ఘన స్వాగతం
థింసా నృత్య ప్రదర్శన అద్భుతమని కొనియాడిన ప్రధాని
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 1. ( పున్నమి ప్రతినిధి )
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి విచ్చేసిన గౌరవనీయ భారత ప్రధాని శ
నరేంద్ర మోదీ కి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గిరిజన కళాకారులు అపూర్వ స్వాగతం పలికారు. ప్రధాని రాకను పురస్కరించుకుని 13 వేల మంది గిరిజన బాలికలు సాంప్రదాయ గిరిజన నృత్య రూపమైన “థింసా” కళాకారులు తమ ప్రత్యేక ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తన పర్యటనలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ప్రధాని కి గిరిజన సాంప్రదాయ వాయిద్యాలు, లయబద్ధమైన థింసా నృత్య అడుగులతో కళాకారులు ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ గిరిజన మహిళలు చేసిన ఈ నృత్యం పర్యటన ప్రాంతంలో పండుగ వాతావరణాన్ని నింపింది.
కళాకారుల ఆత్మీయ స్వాగతానికి ప్రధాని మోదీ ఎంతగానో స్పందించారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే థింసా నృత్యాన్ని ఆయన ఆసక్తిగా తిలకించి, కళాకారులను అభినందించారు. దేశంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడంలో గిరిజన కళారూపాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.



