తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వారం రోజులుగా కొనసాగిన భక్తుల రద్దీ సోమవారం కొంత తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు నిండిపోయి, రింగురోడ్డు మీదుగా శిలాతోరణం వరకు భక్తులు వేచియున్నారు. సర్వదర్శనం భక్తులకు 14 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. ఆదివారం అత్యధికంగా 98,058 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు దాదాపు 18,45,823 మంది దర్శించుకోగా, కొన్ని తేదీలలో రోజుకు 90 వేలకు పైగా భక్తులు వచ్చారు. ఇదే రద్దీ కొనసాగితే ఈ నెలలో దాదాపు 25 లక్షల మంది శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ | సర్వదర్శనానికి 14 గంటల సమయం
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వారం రోజులుగా కొనసాగిన భక్తుల రద్దీ సోమవారం కొంత తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు నిండిపోయి, రింగురోడ్డు మీదుగా శిలాతోరణం వరకు భక్తులు వేచియున్నారు. సర్వదర్శనం భక్తులకు 14 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. ఆదివారం అత్యధికంగా 98,058 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు దాదాపు 18,45,823 మంది దర్శించుకోగా, కొన్ని తేదీలలో రోజుకు 90 వేలకు పైగా భక్తులు వచ్చారు. ఇదే రద్దీ కొనసాగితే ఈ నెలలో దాదాపు 25 లక్షల మంది శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది.

