*
(జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో)
*రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. ఖాతాల్లో నగదు జమ అయినట్లు సందేశాలు అందడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కావలి మార్కెట్ కమిటీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి తల్లికి ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు” ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్ ” విద్యాశాఖ మంత్రి “”నారా లోకేష్ “” నాయకత్వంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు*
పేద, మధ్యతరగతి కుటుంబాలపై విద్యా ఖర్చుల భారం తగ్గించి, విద్యార్థులు చదువును కొనసాగించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని “అలేఖ్య ” పిలుపునిచ్చారు*

తల్లికి వందనం’తో విద్యార్థుల కుటుంబాల్లో ఆనందం*
* (జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో) *రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. ఖాతాల్లో నగదు జమ అయినట్లు సందేశాలు అందడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కావలి మార్కెట్ కమిటీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి తల్లికి ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు” ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్ ” విద్యాశాఖ మంత్రి “”నారా లోకేష్ “” నాయకత్వంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు* పేద, మధ్యతరగతి కుటుంబాలపై విద్యా ఖర్చుల భారం తగ్గించి, విద్యార్థులు చదువును కొనసాగించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని “అలేఖ్య ” పిలుపునిచ్చారు*

