తనయాలిలో ప్రారంభమైన టిడిపి ఇంటింట ప్రచారం
దొరవారి సత్రం జూలై 28 (పున్నమి న్యూస్ )
దొరవారిసత్రం:- మండలంలోని తనయాలి గ్రామంలో సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇంటింట ప్రచారం కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్బంగా నాయకులు కొత్తకండ్రిగ, కమ్మకండ్రిగ లోని ప్రతి గడపగడపకు వెళ్లి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.అనంతరం స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీలోని పార్టీ నాయకులు వేమసాని నాగేంద్రనాయుడు, నిక్కినేని చెంచయ్య నాయుడు, గుత్తా ప్రమీలమ్మ, పాదెళ్ళ కరుణాకర్ రెడ్డి, సంచి విజయకుమార్, గొంజి పీరయ్య, వల్లాం చంద్రయ్య, కరప కామాక్షయ్య, ఘట్టమనేని శ్రీనివాసులు నాయుడు పొదిలి సురేష్ నాయుడు, కొల్లపట్టు కిష్టయ్య పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.


