పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ జులై 28 చిట్టమూరు మండలం,
విద్యార్థుల్లో కంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలని లక్ష్యంతో జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆదేశాల మేరకు టిఎంఆర్ పాఠశాల, కళాశాలలో మంగళవారం వచ్చేత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు.
బాల్రెడ్డి పాలెం ప్రథమక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జివివి రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో వందలాది మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, 46 మంది విద్యార్థుల్లో దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జి వి రమణ మాట్లాడుతూ, గుర్తించిన విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా త్వరలోనే ఉచిత కంటే అద్దాలు అందజేస్తామని తెలిపారు.
కంటి సమస్యలను ప్రారంభం దశలోనే గుర్తించడం ద్వారా విద్యార్థుల సదువుపై ప్రతికూల ప్రభావం పడకుండా నివారించవచ్చని పేర్కొన్నారు.
టిఎంఆర్ విద్యాసంస్థల కరెస్పాండెంట్ డాక్టర్. మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యమే తమ విద్యా సమస్త కు అత్యంత ప్రధానమని అన్నారు.
నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ, తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
కంటి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల విద్యార్థుల విద్యాభ్యాసం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ శాఖల సహకారంతో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య సేవల అందించేందుకు టిఎమ్ఆర్ విద్యా సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రహంతుల్లా, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



