08-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని జొన్నాడ గ్రామంలో వెలసివున్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయం లో నేటి నుండి స్వామి అమ్మవార్ల దర్శనాలు పునః ప్రారంభం కానున్నాయి. మన రాష్ట్రం లోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో జొన్నవాడ కామాక్షమ్మ దేవస్థానం ఒకటి. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా సుమారు మూడు నెలల పాటు ఆలయం మూత పడటంతో భక్తులు అమ్మవారి దర్శన భాగ్యంకు నోచుకోలేక పోయారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించి దేవాలయాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో రేపటి నుండి జొన్నవాడ ఆలయంలో భక్తుల దర్శనార్థం మల్లికార్జున స్వామి సమేత అమ్మవార్ల దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను ఆలయ సిబ్బంది ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి రెండు రోజులు జొన్నవాడ గ్రామస్తులకు దర్శనాలు అనుమతి ఉందని, ట్రైల్ రన్ పూర్తయిన తర్వాత అందరిని అనుమతిస్తామని ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీని వాసులరెడ్డి తెలిపారు.
జొన్నవాడ కామాక్షమ్మ దర్శనానికి సర్వం సిద్ధం.
08-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని జొన్నాడ గ్రామంలో వెలసివున్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయం లో నేటి నుండి స్వామి అమ్మవార్ల దర్శనాలు పునః ప్రారంభం కానున్నాయి. మన రాష్ట్రం లోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో జొన్నవాడ కామాక్షమ్మ దేవస్థానం ఒకటి. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా సుమారు మూడు నెలల పాటు ఆలయం మూత పడటంతో భక్తులు అమ్మవారి దర్శన భాగ్యంకు నోచుకోలేక పోయారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించి దేవాలయాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో రేపటి నుండి జొన్నవాడ ఆలయంలో భక్తుల దర్శనార్థం మల్లికార్జున స్వామి సమేత అమ్మవార్ల దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను ఆలయ సిబ్బంది ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి రెండు రోజులు జొన్నవాడ గ్రామస్తులకు దర్శనాలు అనుమతి ఉందని, ట్రైల్ రన్ పూర్తయిన తర్వాత అందరిని అనుమతిస్తామని ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీని వాసులరెడ్డి తెలిపారు.