ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 19 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో విద్యుత్ అంతరాయాలు, తక్కువ వోల్టేజ్ సమస్యలను నివారించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నూతన విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశారు. ఏఈ అనిల్ కుమార్ పర్యవేక్షణలో చేపట్టిన ఈ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొన్నూరు అశోక్ కుమార్, అల్లూరు సుమన్ తేజ, చిలుకూరు నరసింహులు నరసయ్య పాల్గొని పనులను పరిశీలించారు. గ్రామ ప్రజలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందించారు.

చెర్లోపల్లిలో విద్యుత్ సమస్యల నివారణకు నూతన విద్యుత్ లైన్లు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 19 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో విద్యుత్ అంతరాయాలు, తక్కువ వోల్టేజ్ సమస్యలను నివారించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నూతన విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశారు. ఏఈ అనిల్ కుమార్ పర్యవేక్షణలో చేపట్టిన ఈ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొన్నూరు అశోక్ కుమార్, అల్లూరు సుమన్ తేజ, చిలుకూరు నరసింహులు నరసయ్య పాల్గొని పనులను పరిశీలించారు. గ్రామ ప్రజలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందించారు.

