పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే సగం చీరలు జిల్లాలకు చేరగా మిగిలినవి త్వరలో రానున్నాయి దసరాకు ముందే పంపిణీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు పారదర్శకత కోసం ప్రతి మహిళకు చీర అందజేతను ఫోటోతో నమోదు చేయనున్నట్లు సమాచారం గతంలో పాలపిట్ట రంగు చీరలు ఇవ్వగా ఈసారి చిలకపచ్చ రంగు చీరలు పంపిణీ చేయనున్నారు



