కామారెడ్డి, 29 జులై, ( పున్నమి ప్రతినిధి ) :. సమాజంలో తోటి మనుషుల అభ్యున్నతి కోసం, నిస్సహాయుల ఆకలి తీర్చడం కోసం తమ జీవితా లను అంకితం చేసిన నిజమైన సేవామూర్తులను గుర్తించి సత్కరించడం ద్వారా ఆ సంస్కృతి మరిం తగా పరిఢవిల్లుతుంది. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్క రించుకుని కామారెడ్డి జిల్లాలో అంకితభా వంతో సేవనందిస్తున్న ప్రముఖులను ఘనంగా సన్మరించిన వైనం స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుం టోంది.సెంట్రల్ కమిటీ ఎండోమెంట్ ధా ర్మిక పరిషత్ మార్గదర్శకాలకు అనుగుణంగా, కా మారెడ్డి ప్రాంతంలో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇస్కాన్ సంస్థకు చెందిన అర వింద్ కృష్ణదాస్ ప్రభుజి మాట్లాడుతూ, తన జీవి తం పూర్తిగా భగవత్ సేవకే, మానవ సేవలకే అంకి తమని మరోసారి నిరూపించారు.సేవే పరమావధి గా.. అనాథల ఆపద్భాంధవులుగా శోభనాయక్ దంపతులు కామారెడ్డి పట్టణంలోని భవానిపేట్ – ఆరేపల్లి ప్రాంతాల మధ్య ఎంతో ఆదర్శంగా అనా థాశ్రమాన్ని నిర్వహిస్తున్న శోభనాయక్ దంపతులు నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తూ అభాగ్యుల పా లిట దేవుడిగా నిలుస్తున్నారు. సమాజం కన్నెత్తి చూడని అనాథలకు కడుపు నిండా భోజనం పెడు తూ, కష్టకాలంలో ఆసరాగా నిలుస్తున్న ఈ దంప తుల సేవలు అత్యంత స్ఫూర్తిదాయకం.ఈ గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా వారి సేవలను గుర్తిం చిన ప్రముఖులు శోభనాయక్ దంపతులను ఘనంగా సన్మానించి, శాలువాలతో సత్కరించారు. తోటి మనుషులకు అండగా నిలిచే ఇలాంటి వ్యక్తు లను సన్మానించడం ద్వారా సమాజంలో మంచి సందేశం వెళ్తుందని ఈ సందర్భంగా వక్తలు అభిప్రా యపడ్డారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఎండోమెంట్ కామారెడ్డి జిల్లా కో-కన్వీనర్ పన్యాల నరేందర్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు చేగంటి నరేష్, గంగయ్యల బాబా గౌడ్,రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



