ఖమ్మం: జనసేన ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న ఖమ్మం నగరంలోని ఎంబీ గార్డెన్స్లో “తెలంగాణ రాష్ట్ర శంఖారావం” సభ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. సభా ప్రాంగణానికి పద్మశ్రీ వనజీవి రామయ్య ప్రాంగణంగా నామకరణం చేశారు. ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి “వనజీవి రామయ్య వారధి”గా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత, పట్టభద్రులు, ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా జనసేన సమరశంఖం పూరిస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి జనసైనికులు, వీరమహిళలు, యువత, ప్రజలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజా సమస్యలను బలంగా వినిపించడమే లక్ష్యంగా శంఖారావం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.



